జూబ్లీహిల్స్ : టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు బంగారు భవిష్యత్తు ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. బుధవారం తనను కలిసిన యూసుఫ్గూడ టీఆర్ఎస్ మహిళా నేతలతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళాల్సిన గురుతర బాధ్యత మహిళలపై ఉందన్నారు.
టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్కు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గీతా గౌడ్ ఆధ్వర్యంలో మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి నిర్మల తదితరులు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.