బంజారాహిల్స్ : హారన్ మోగించాడని ఆగ్రహంతో వ్యక్తిపై దాడికి పాల్పడిన ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏజే కాలనీ సమీపంలోని నేతాజీనగర్లో నివాసం ఉంటున్న మహ్మద్ ముస్తాక్ అహ్మద్ చేపల వ్యాపారం చేస్తుంటాడు. ఆదివారం రాత్రి ఇనాయత్ అనే వ్యక్తితో కలిసి మహ్మద్ ముస్తాక్ చార్మినార్కు వెళ్లి తిరిగి వస్తున్నాడు.
జీటీఎస్ కాలనీ సమీపంలో సిగ్నల్ వద్ద వెళ్తున్న సమయంలో వినయ్, వినోద్, బన్నీ అనే ముగ్గురు యువకులు నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ మీదకు వచ్చారు. దాంతోముస్తాక్ హారన్ కొట్టి సరిగా వెళ్లాలంటూ సూచించాడు. దీంతో ఆగ్రహానికి లోనయిన ముగ్గురు యువకులు ఓవర్ టేక్ చేసి వచ్చి ముస్తాక్ అహ్మద్పై దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.