రవీంద్రభారతి : తెలంగాణ ప్రభుత్వం గౌడ సామాజిక వర్గానికి వైన్షాప్ల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్లను కేటాయించినందుకు గౌడ జన హక్కులు పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ ఆద్వర్యం లో మంగళవారం మంత్రి శ్రీనివాసగౌడ్ కార్యాలయంలో కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కేసీఆర్ గౌడల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.
అందులో భాగంగా గౌడ వృత్తిదారులు సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాంధించేందుకు దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నారన్నారు. వృత్తిపన్ను రద్దు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు గీతవృత్తిలో గాయపడిన, చనిపోయిన కార్మికులకు చెల్లించే ఎక్సెగ్రేషియాను పెంచి అండగా నిలిచారన్నా రు. రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు వైన్షాపుల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్లు కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలోని గౌడ్లు, ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సెక్రటరి జనరల్ రాగుల సిద్దిరాములుగౌడ్, బాలసాని సురేష్గౌడ్, పల్లే ఉపేందర్గౌడ్, మహేశ్వర్గౌడ్, శ్యామ్రావుగౌడ్ ,కదిరే అంజనేయులుగౌడ్, రాగుల కిరణ్కుమార్గౌడ్,పన్యాల మమతాగౌడ్, ఎం. శైలజగౌడ్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మంద రామారావుగౌడ్, సాయిగౌడ్, వీరాస్వామిగౌడ్, బిక్షపతిగౌడ్ పాల్గొన్నారు.