మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
లక్ష్మణచాంద మండలం వడ్యాల్లో రైతు వేదిక, సారంగాపూర్ మండలం స్వర్ణ వద్ద బ్రిడ్జి ప్రారంభం
లక్ష్మణచాంద, జూన్ 7: రైతుబంధు పథకం డబ్బులను ప్రభుత్వం ఈనెల 15 నుంచి జమ చేయనుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మండలంలోని వడ్యాల్లో రైతువేదికను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విపత్కర పరిస్థిల్లోనూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. ఈ సంవత్సరం యాసంగిలో 1.20 లక్షల మెట్రిక్టన్నుల వరిధాన్యం పండుతుందని అధికారులు అంచనావేయగా 1.80 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందని వెల్లడించారు. రైతు బీమా ద్వారా వడ్యాల్ క్లస్టర్లో రూ. 1.36 కోట్లు అందించినట్లు తెలిపారు. మక్కకు బదులుగా పత్తి వేసుకోవాలని మంత్రి సూచించారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. నిర్మల్ జిల్లాలో 1.25 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేశామని చెప్పారు. వడ్యాల్, లక్ష్మణచాంద గ్రామాల్లో బైపాస్రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. రోడ్డు నిర్మాణంలో ఇండ్లు కోల్పోయినవారికి డబుల్బెడ్రూం ఇండ్లు అందజేస్తామన్నారు. వడ్యాల్ను నూతన మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా 7 ఎంపీటీసీ స్థానాలు ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పారు. ఆ దిశగా గ్రామస్తులు ప్రయత్నిస్తే మండలం మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమం లో డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, రైతు బంధుసమితి జిల్లా కన్వీనర్ వెంకట్రాంరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మెన్ రఘునందన్ రెడ్డి, లక్ష్మణచాంద టీఆర్ఎస్ ఇన్చార్జి అల్లోల సురేందర్ రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మీ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, వడ్యాల్ సర్పంచ్ అట్ల లలిత,తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో మోహన్, ఏవో ప్రవీణ్ కుమార్, ఏఈవో సంతోష్, వైస్ ఎంపీపీ కల్పన, రాంరెడ్డి, నాయకులు కేశం రమేశ్, అడ్వాల రమేశ్, గుజ్జారి గణేశ్, జహీరొద్దీన్ పాల్గొన్నారు.
సాగునీటికి ప్రభుత్వం పెద్దపీట
సారంగాపూర్, జూన్ 7: సీఎం కేసీఆర్ సాగునీటికి ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని స్వర్ణ-జౌళి గ్రామాల మధ్య రూ. 90 లక్షలతో నిర్మించిన లోలెవల్ కాజ్వే బ్రిడ్జిని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 27 కాల్వ నిర్మాణం పనులు పూర్త యితే ఆయకట్టు రైతులకు రెండు పంటలకూ నీళ్లు అందుతాయన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఎక్కువ చెక్డ్యామ్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రాంరెడ్డి, మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, మార్కెట్ చైర్మన్ వంగ రవీందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, అడెల్లి చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, ఆలూర్ సొసైటీ అధ్యక్షుడు మాణిక్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఇప్ప మధుకర్ రెడ్డి, సర్పంచ్లు లక్ష్మి, రవీందర్రెడ్డి, ఎంపీటీసీ భోజారెడ్డి, నాయకులు మల్లేశ్, హది, రాజేశ్వర్, ఇస్మాయిల్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.