హాజరైన శాసనమండలి ప్రొటెం చైర్మన్
భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
పటాన్చెరు, ఆగస్టు 2 : పటాన్చెరు పట్టణంలో బోనాల పండుగ, ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలతో సంబురాలు అంబరాన్నంటాయి. జీఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయం నుంచి చేపట్టిన ఫలహారం ఊరేగింపు కార్యక్రమాన్ని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తీన్మార్ స్టెప్పులు వేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను అధికారికంగా ప్రకటించారన్నారు. ప్రపంచంలోని నలుమూలలా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. పట్టణంలోని ఏడుగుళ్ల పోచమ్మ దేవాలయం, యాదవుల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, సీఐ వేణుగోపాల్రెడ్డి, మాజీ కార్పొరేటర్ శంకర్యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆదర్శ్రెడ్డి, విజయ్కుమార్, యాదగిరియాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, నాయకులు వెంకటేశ్ పాల్గొన్నారు.