కొవిడ్ వచ్చినా అహర్నిశలు రైతులు, జనం కోసమే తపించారు
ఎస్సారెస్పీ జలాలతో చెరువులు నిండాయా అని ఆరా తీశారు
అది ముఖ్యమంత్రి దార్శనికత,నిబద్ధతకు నిదర్శనం
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
నకిరేకల్లో మున్సిపల్ ఎన్నికల సమావేశం
కట్టంగూర్, ఏప్రిల్ 22 : తనకు కొవిడ్ వచ్చినా అహర్నిశలు రైతులు, ప్రజల కోసం సీఎం కేసీఆర్ తపిస్తున్నారని, సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ జలాల రాక, నిండిన చెరువులపై ఫోన్లోఆరా తీయడం ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నకిరేకల్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నాయకుల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని, మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కొవిడ్ బారిన పడినా అహర్నిశలు రైతులు, ప్రజల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ తపిస్తున్నారని, ప్రజల బాగోగులే ఆయనకు ముఖ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నకిరేకల్ మున్సిపాల్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులతో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కొత్తగా ఏర్పాటైన నకిరేకల్ మున్సిపాల్టీపై గులాబీ జెండా ఎగురాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్దేనని, మున్సిపల్ ఎన్నికల్లోనూ 20వార్డులు గెలిచి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ జలాలతో చెరువులన్నీ నిండాయా..? చివరి భూములకు నీళ్లు అందుతున్నాయా..? అని సీఎం కేసీఆర్ ఫోన్లో ఆరా తీశారని, అది ఆయన దార్శనికతకు, నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. నకిరేకల్ రూపురేఖలను మార్చుకొనే గొప్ప అవకాశం ఇక్కడి ప్రజలకు వచ్చిందని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు తీస్తుందని అన్నారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలిచిన తరువాత నియోజకవర్గం అభివృద్ధికి ముఖద్వారంగా నిలిచిందని గుర్తుచేశారు. నకిరేకల్ అభివృద్ధి కోసం వచ్చిన ఈ ఎన్నికల్లో పట్టణ వాసులు ఆలోచన చేసి ఓటెయ్యాలని మంత్రి కోరారు. పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులందరినీ కలుపుకొని గెలుపు దిశగా పయనించాలని కోరారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు : మంత్రి కొప్పుల
ప్రతి ఒక్కరు టీకాను వేసుకోవాలి : బీపీ ఆచార్య
తాజ్ హోటల్ సెట్ కోసం ఎందరు పనిచేశారో తెలుసా..?