కడెం, ఏప్రిల్ 29: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్లో ఉద్యానవన, పట్టుపరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆదేశించారు. గురువారం కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వారితో మాట్లాడారు. 20 ఎకరాలకు పైగా భూమి ఉండగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడి భూములను కబ్జాలు చేశారని ఎమ్మెల్యేకు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రాన్ని సందర్శించిన ఆమె ఉద్యానవన, పట్టుపరిశ్రమ కేంద్రానికి సంబంధించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట ఎంపీపీ అలెగ్జాండర్, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు హపావత్ రాజేందర్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫిక్ హైమద్, టీఆర్ఎస్ మండల కో-ఆర్డినేటర్ కానూరి సతీశ్, మాజీ మండల అధ్యక్షుడు నల్ల జీవన్రెడ్డి, టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి హసీబ్, నాయకులు రమేశ్రావు, తదితరులున్నారు.