పారుపల్లిలో రూ.4.46 కోట్లతో, కామునిగూడెంలో రూ.1.37కోట్లతో చెక్డ్యాం నిర్మాణ పనులు వేగవంతం
ఒక్కసారి వాగు పారితే రెండేండ్లు పంటలకు నీటి కొరత ఉండదు
బిక్కేరు వాగులో చెక్ డ్యాంల నిర్మాణంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆత్మకూరు(ఎం), మార్చి 31 : రైతులకు సమృద్ధిగా సాగునీరందించి కరువును శాశ్వతంగా నివారించాలనే సంకల్పంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చెక్డ్యాంల నిర్మాణం చేపట్టింది. దీనిలో భాగంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సహకారంతో ఆత్మకూర్(ఎం) మండలంలోని పారుపల్లి బిక్కేరు వాగులో రూ.4.46 కోట్లతో, ఆత్మకూరు(ఎం) గ్రామ పంచాయతీ పరిధిలోని కామునిగూడెంలోని బిక్కేరు వాగులో రూ.1.37 కోట్లతో చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. 10నెలల కిందట పనులు ప్రారంభించగా, పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. దీంతో ఒక్కసారి వాగు పారితే రెండేండ్లపాటు నీటి కరువు తీరనున్నది. వాగుల వెంట ఉన్న వ్యవసాయ బావులు, బోర్లలో నీటి ఊట పెరగడంతోపాటు కరువు తీరనున్నది. చెక్డ్యాంల నిర్మాణం పూర్తికావొస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాగు నీటి కరువును శాశ్వతంగా నివారించాలనే సంకల్పంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన చెక్డ్యాంల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సహకారంతో మండలంలోని పారుపల్లి బిక్కేరు వాగులో రూ.4.46కోట్లతో, ఆత్మకూరు(ఎం) గ్రామ పంచాయతీ పరిధిలోని కామునిగూడెంలోని బిక్కేరు వాగులో రూ.1.37 కోట్లతో చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి 10 నెలల కిందట పనులు ప్రారంభించారు.
వేగంగా చెక్డ్యాం నిర్మాణం పనులు
పారుపల్లి, కామునిగూడెం బిక్కేరు వాగులపై నిర్మిస్తున్న చెక్డ్యాంల నిర్మాణ పనులు వేగవంతంగా సాగడంతోపాటు 15రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. ఒక్కసారి వాగు పారితే రెండేండ్లపాటు నీటి కరువు తీరనున్నది. వాగుల వెంట ఉన్న వ్యవసాయ బావులు, బోర్లలో నీటి ఊట పెరగడంతో పాటు కరువు తీరనున్నది.
కామునిగూడెం చెక్డ్యాంతో 500 ఎకరాలకు మేలు
ఆత్మకూరు(ఎం) గ్రామ పంచాయతీ పరిధిలోని కామునిగూడెంలోని బిక్కేరు వాగులో నిర్మిస్తున్న చెక్డ్యాం నిర్మాణంతో సుమారు 500 ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కలుగనున్నది. 50 బోర్లతో పాటు 15 వ్యవసాయ బావుల్లో కూడా చెక్డ్యాం నిర్మాణంతో నీటి ఊట పెరుగనున్నది.
చెక్డ్యాం మంజూరు చేయడం హర్షణీయం
గ్రామ రైతుల కోసం గ్రామంలోని బిక్కేరు వాగులో చెక్డ్యాం నిర్మా ణం చేపట్టాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డిని అడిగిన వెంటనే నిర్మాణానికి రూ.4.46 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయం. గ్రామంలోని బిక్కేరు వాగులో నిర్మిస్తున్న చెక్డ్యాంతో రానున్న కాలంలో నాలుగు గ్రామాల రైతులకు ఎంతో మేలు జరుగనున్నది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రైతులను ఆదుకునేందుకు చెక్డ్యాంల నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉన్నది.
చెక్డ్యాం చేపట్టడం సంతోషం
బిక్కేరు వాగులో చెక్డ్యాం నిర్మాణం చేపట్టడం సంతోషం గా ఉన్నది. వాగును ఆనుకొని నాకు 4 ఎకరాల పొలం ఉండగా, ఎండాకాలంలో నీటి సౌకర్యం లేకపోవడంతో వరి పంటలు ఎండిపోయిన సందర్భాలు ఉన్నా యి. నేడు నా పొలం పక్కన ఉన్న బిక్కేరు వాగులో చెక్డ్యాంను నిర్మించడంతో మునుముందు సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు రాకపోవడంతోపాటు అధిక పంటలు పండనున్నాయి. – గన్న నర్సిరెడ్డి, రైతు, పారుపల్లి
చెక్డ్యాం నిర్మాణంతో రైతులకు ఎంతో మేలు
ఆత్మకూరు(ఎం) గ్రామ పంచాయతీ పరిధిలోని కామునిగూడెం బిక్కేరు వాగులో చెక్డ్యాం నిర్మాణానికి ప్రభుత్వ విప్ రూ.1.37 కోట్లు మంజూరు చేయించడంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఆత్మకూరు(ఎం), కామునిగూడెం గ్రామాల్లోని రైతులకు చెక్డ్యాం నిర్మాణంతో ఎంతో మేలు జరుగనున్నది. చెక్డ్యాం నిర్మాణానికి సహకరించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
పారుపల్లి చెక్డ్యాంతో నాలుగు గ్రామాలకు మేలు
పారుపల్లి బిక్కేరు వాగులో నిర్మిస్తున్న చెక్డ్యాం నిర్మాణంతో పారుపల్లితోపాటు గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి, సీతారాంపురం, సుద్దాల గ్రామాల్లో సుమారు 300 మంది రైతులకు సంబంధించిన 500 ఎకరాల వరి సాగుకు నీటి సౌకర్యం కలుగనున్నది. 150 బోర్లతోపాటు 50 వ్యవసాయ బావుల్లో నీటి ఊట పెరగనుండటంతో చెక్డ్యాం నిర్మాణాన్ని ఆయా గ్రామాల రైతులు హర్షిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇవి కూడా చుడండి
ముఖంపై గోధుమరంగు మచ్చలు.. బైబై చెప్పేందుకు చిట్కాలు
చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం.. వ్యాక్సిన్ ఇప్పించడం తప్పనిసరి