ఎల్బీనగర్ : పేదలకు అధునాతన వైద్య సేవలు పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. ఆదివారం కర్మన్ఘాట్కు చెందిన శంకరయ్యకు రూ. 14 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం చేయించుకున్న పేద వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయుత అభిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాకారంతో పేదలు మంచి వైద్య సేవలు పొందుతున్నా రని అన్నారు.