మైలార్దేవ్పల్లి : ఆర్ధిక ఇబ్బందులతో మహిళ మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మహబుబ్నగర్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన ఆంజనేయులు, భార్య షాహిన్ బేగం (35), కుమారుడు ఇమ్రాన్ (12) లతో కలిసి మైలార్దేవ్పల్లి డివిజన్ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెం2 రూమ్ నెం 23లో నివసిస్తున్నారు.
ఆంజనేయులు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఆంజనేయులు మహబుబ్నగర్కు వెళ్లాడు. కాగా షాహిన్ బేగం సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.