చిక్కడపల్లి : తెలంగాణ రాష్ట్రంలో దళత బంధు పథకాన్ని విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వివరించారు. శుక్రవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధు సొసైటీ ఆధ్వర్యంలో 72వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండ శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.
బంధుసొసైటీ అధ్యక్షుడు వీరాస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైడ్ ఐఆర్ఎస్ అధికారి భరత్భూషన్, ఎర దేవదానం, డాక్టర్ చిలుకా భాస్కర్, గండి కృష్ణ, బిహెచ్ రవీంద్ర, ఎస్.కె.బాబులాల్, ప్రొఫెసర్ ముత్తయ్య ,వాల్సీకి తదితరులు పాల్గొన్నారు.