చిక్కడపల్లి : రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ఐక్యంగా కృషి సాగించాలని ప్రజవాగ్గేయకారుడు,ఎంఎల్సీ గొరేటి వెంకన్న అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్యంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’’అనే అంశంపై సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరేటి వెంకన్న మాట్లాడుతూ రాజ్యాంగ లక్ష్యాల అమలు కోసం రాజ్యాంగ అవగాహన సదస్సులు జరిపి పల్లెల్లో చైతన్యం తేవాలన్నారు. హైదరాబాద్ యూనియవర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు మాట్లాడుతూ రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ రాయబడిందన్నారు.
కేవీపీఎస్ నగర కార్యదర్శి కె.యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, నాయకులు బాలు, కృపాసాగర్, దశరథ్, బి.సుబ్బారావు, గంటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.