తెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నాయని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవారం పర్వతగిరి మండలంలోని దౌలత్నగర్ గ్రామంలో రూ. కోటితో బీటీ రోడ్డు పనులు, అనంతారం గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థ్ధాపన చేశారు. వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితోనే గ్రామాలు ఆదర్శంగా మారాయని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పర్వతగిరి, జూలై 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. మండలంలోని దౌలత్నగర్ గ్రామంలో రూ.కోటితో బాజు తండా నుంచి టూక్య తండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు బుధవారం ఎమ్మెల్యే అరూరి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.12 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పల్లెలు నిలిచాయన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్యార్డులు, సీసీ రోడ్లు నిర్మించి, పల్లెలను దేశానికి పట్టుకొమ్మలుగా నిలిపారన్నారు. దౌలత్నగర్ గ్రామ అభివృద్ధి, సంక్షేమం కోసం ఇప్పటి వరకు రూ. 17.18కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొల్లూరి వెంకటేశ్వర్లు, చీమల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. కాగా, గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు.
మండలంలోని అనంతారం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, డ్రైనేజీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్లాల్, సర్పంచ్ తౌటి దేవేందర్, పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, సర్వర్ పాల్గొన్నారు.
పర్వతగిరి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆధునీకరించిన సమావేశ మందిరాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్, ఎంపీపీ కమల, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు పట్టపురం ఏకాంతంగౌడ్, పల్లెపాటి శాంతిరతన్రావు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, ఎంపీవో పాక శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.9.08లక్షల విలువ గల చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు, తహసీల్దార్ కోమీ, ఉపసర్పంచ్ రంగు జనార్దన్, బొట్ల మధు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అబివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం అప్రమత్తంగా ఉండి పని చేయాలన్నా రు. మండల పరిధిలో పెండింగ్ పనులు, ఇంకా చేపట్టాల్సిసిన పనులపై ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రణాళికలు రూ పొందిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు. అభివృద్ది కార్యక్రమాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్లాల్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.