మహబూబ్నగర్, ఏప్రిల్ 16 : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, ఇందులో భాగంగానే ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. హన్వాడ మండలం రామన్నపల్లి గ్రామానికి చెందిన రాములు హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో వైద్య చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2 లక్షల ఎల్వోసీని శుక్రవారం రాష్ట్ర రాజధానిలోని క్యాంప్ కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశాడు. నిరుపేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ధైర్యంగా ఉండండి
ధైర్యంగా జీవించాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాము ఉన్నామని గుర్తు పెట్టుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. హన్వాడ గ్రామానికి చెందిన కుమార్, జంగ వెంకటయ్యలు ఇటీవల గోడకూలి మృతి చెందారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్లతో మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేకంగా మాట్లాడి కుమార్ భార్య మొగులమ్మకు రూ.5.50 లక్షలు, వెంకటయ్య భార్య లక్ష్మమ్మకు రూ.2.50 లక్షల ఆర్థిక సాయాన్ని శుక్రవారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అందజేశారు. కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ నేతికాని వెంకటేశ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య, ఎంపీపీ బాలరాజు, టీఆర్ఎస్ నేత కృష్ణార్జున్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
మొబైల్ రీచార్జ్ కోసం అమ్మమ్మ ఉసురుతీశాడు
హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మేయర్