లక్నో: యూపీలో దారుణం చోటుచేసుకుంది. మొబైల్ రీచార్జ్ కు డబ్బులు ఇవ్వలేదనే ఆగ్రహంతో అలీగఢ్ కు సమీపంలోని పద్రా గ్రామంలో ఈనెల 2న తన అమ్మమ్మను బాలుడు హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బాలుడు స్నేహితులతో కలిసి ఊపిరిఆడకుండా చేయడంతో బాధితురాలు మరణించింది. గుండెపోటుతో ఆమె మరణించిందని భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆపై అనుమానంతో బాలుడిని నిలదీయగా నేరం అంగీకరించాడు. నిందితుడితో పాటు అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.