హైదరాబాద్ : కరోనా వ్యాప్తి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. నిమ్స్లో కొవిడ్ టీకా రెండో డోసును జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తీసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 45 ఏండ్లు దాటిన వారందరూ కరోనా టీకా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు తప్పకుండా టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానను రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మారుస్తూ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం నుంచి దవాఖానలో ఓపీ సేవలను నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను సైతం నిలిపి వేసి కేవలం కొవిడ్ బాధితులకు మాత్రమే వైద్యులు చికిత్స అందించనున్నారు. ఇప్పటికే దవాఖానలో 450కి పైగా రోగులు ఉన్నారు. నిన్న ఒక్కరోజే 150మంది చికిత్స నిమిత్తం చేరారు. గాంధీ దవాఖానకు కొవిడ్ రోగుల తాకిడి క్రమంగా పెరుగుతున్నది. దీంతో బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఇతర డిపార్టుమెంట్లను వైద్యులు ఖాళీ చేయిస్తున్నారు.