కోస్గి, ఏప్రిల్ 4: విద్యార్థులు టీవీ, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని టేబుల్టెన్నిస్ క్రీడాకారిణి నైనాజైస్వాల్ అన్నారు. పట్టణంలోని లక్ష్మీనర్సింహ ఫంక్షన్హాల్లో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ తరగతులకు సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు మొదటి గురువు తల్లిదండ్రులని, వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదివితే ఏదైనా సాధ్యమన్నారు. తెలివి ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ ఉండదని, అందరికీ సమానంగా ఉంటుందన్నారు. అం తకుముందు ఆమె తండ్రి అశ్విన్జైస్వాల్ మాట్లాడుతూ తాను తన పిల్లలను ఎలా చదివించాననే అంశాలను విద్యార్థులకు వివరించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పాలన్నారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదివితే సాధ్యం కానిది ఏదీలేదన్నారు. జిల్లాలో 100శాతం పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు కార్యక్రమ నిర్వాహకులు వీరమల్లేశ్, నాగరాజును సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంవో విద్యాసాగర్, ఎంఈవో అంజలీదేవి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.