కందుకూరు : ఈ నెల 26 గురువారం మండలంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ రమేష్గౌడ్ తెలిపారు. ఫ్యాబ్ సిటిలోని 220కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా కందుకూరు, లేమూరు, రాచులూరు, మీర్ఖాన్పేట్,నేదునూరు, ముచ్చర్ల, పులిమామిడి,గుమ్మడవెల్లి, జైత్వారం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 10గంటల నుండి మద్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు, రైతుల గమనించి సహకరించాలని కోరారు.
మహేశ్వరం పరిధిలో …
విద్యుత్ మరమత్తుల కారణంగా గురువారం పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు మహేశ్వరం విద్యుత్ ఏఈ సుధాకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ప్యాభ్సిటీ పీడర్ పరిధిలోని 220 కేవీ పరిధిలోని ఇమామ్గూడ, రాంకీ, శ్రీనగర్కాలనీ, హర్షగూడ పలు ప్రాంతాలలో ఉదయం 9.30నుండి మద్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుందని ఆయన అన్నారు.సంబంధిత గ్రామాల ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.