శంషాబాద్ రూరల్ : దేవాలయాల నిర్మాణంతో ప్రజలలో భక్తిభావం పెరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతి, పీఏసీఎస్ డైరక్టర్ గుర్రం అనంతరెడ్డిల ఆధ్వర్యంలో రామాలయం, శివాలయం నిర్మాణాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చేతుల మీదగా పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ యువత చెడుమార్గాల వైపు వెళ్లకుండా భక్తిభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో దేవాలయాల నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. చిన్నగోల్కొండ గ్రామంలో రెండు దేవాలయాలు నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలం మోహన్ నాయక్, మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు కే చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, ఉప సర్పంచ్ భిక్షపతి,వార్డు సభ్యులు గౌతమ్బాబు, సారలక్ష్మీ, రాఘవేందర్,మల్లేష్, మాజీ సర్పంచ్ సారకృష్ణ, టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు సార జంగయ్య, వీరయ్యలతో పాటు పలువురు పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.