ఆర్కేపురం : నేరాలను అదుపుచేయడంలో సీసీ కెమెరాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సరూర్నగర్ డివిజన్ వెంకటేశ్వరాకాలనీ రోడ్ నెం.14లో నూతనంగా ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను ఏసీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రతి కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని మెయింటైన్ చేయాలని సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కాలనీ వాసులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సరూర్నగర్ సీఐ సీతారామ్, ఎస్ఐలు సంజీవ్రెడ్డి, సైదులు, కాలనీ అధ్యక్షుడు సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచారి, మాజీ అధ్యక్షుడు ధర్పల్లి అశోక్, సాధన ట్రస్ట్ చైర్మన్ రమణ, జాయింట్ సెక్రటరీ సప్పిడి గోవర్ధన్రెడ్డి, శ్రీనివాస్రావు, పి.వి.ప్రసాద్, సాయికిరణ్, వెంకటేశ్వరారెడ్డి, రాజశేఖర్రెడ్డి, రాజు,రఘురామ్, విఠల్, రవీందర్,ప్రతామ్రెడ్డి, కృష్ణరాజు, మధుసూదన్రెడ్డి, మురళీ తదితరులు పాల్గొన్నారు.