కందుకూరు : ముదిరాజ్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బూసరమోని అంజయ్యముదిరాజ్ల ఆధ్వర్యంలో మంగళవారం మంత్రిని కలిసి ముదిరాజ్లను డి గ్రూప్లోనుంచి ఏ గ్రూపులోకి మార్చిన జీవో నంబరు 15ను అమలు పర్చాలని, చెరువులపై పూర్తి హక్కులను కల్పించాలని, ప్రతి గ్రామం మండల కేంద్రాల్లో ముదిరాజ్ భవనాలను నిర్మించడానికి కృషి చేయాలని కోరారు.
ముదిరాజ్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముదిరాజ్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకవెల్లి అన్ని విధాలుగా ఆదుకోవడానికి కృషి చేస్తానని వారికి చెప్పారు. ముదిరాజ్లు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో మత్యృకారుల అధ్యక్షుడు ఎంపీటీసీ కాకి రాములు, సర్పంచ్లు కాకి ఇందిరమ్మ దశరథ ముదిరాజ్, ఎడ్ల బాబురావు, గొరెంకల యాదయ్య.వెంకటేష్, కాకి రవి, ఎడ్ల వెంకటేష్, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.