మియాపూర్ : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తుందని , వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా , ఆరోగ్యపరంగా ప్రజలను ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన 43 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 20,33,000ల ఆర్థిక సాయంతో పాటు, కొండాపూర్ డివిజన్ మార్తాండ్నగర్కు చెందిన లక్ష్మీనారాయణకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం తన నివాసంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ,ఇందుకోసం అహర్నిషలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యాల పాలవుతున్న పేదలకు ఆర్థిక అండగా సీఎం సహాయ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతున్నదని, ఎందరో పేదలు ఈ పథకం ద్వారా తమ ఆరోగ్యాలకు స్వస్థతను కల్పించుకున్నారన్నారు.
కరోనా సహా ఎన్ని విపత్కర పరిస్థితులు నెలకొంటున్నా ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం సమర్థంగా ముందడుగు వేస్తున్నదని విప్ గాంధీ పునరుధ్ఘాటించారు. సీఎం సహాయ నిధి దరఖాస్తుదారులకు వీలైనంత త్వరగా సహాయం లభించేలా తాను ఎప్పటికపుడు అధికారులతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా నిలుస్తానని విప్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాయినేని చంద్రకాంత్రావు, దాసరిగోపి, పోతుల రాజేందర్, జంగం తదితరులు పాల్గొన్నారు.