శంషాబాద్ రూరల్ : పేదలకు మెరుగైన వైద్యమందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యమందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. కార్పోరేట్ వైద్య శాలలో పేదలకు వైద్యమందించి వారికి ఆసరాగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భారీ ఎత్తున ఆర్థిక సహాయం చేస్తు ఆదుకుంటున్నట్లు చెప్పారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులుజూకల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ 60వేలు, నానాజీపూర్ యాదమ్మ 60వేలు అందజేశారు.
అలాగే అలీకోల్తండా మారు 60వేలు, పెద్దషాపూర్ రాజయ్య 60వేలు, శంకరాపూర్ సునీత 36వేలు, కాచారం వేణుకుమార్ 44వేలు, సుదర్శన్గౌడ్ 36వేలు, రాయన్నగూడ శ్రీనివాస్ 36వేలు మొత్తం 3,82,000 లక్షల రూపాయలు అందజేశామని తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కే చంద్రారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, మాజీ సర్పంచ్ శ్రీలత,సర్పంచ్ రాంగోపాల్, మండల ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్రావు, మండల కొ-అప్షన్ సభ్యుడు గౌస్ పాషా, నాయకులు దర్గాసత్తయ్య, మైలారం భిక్షపతి, సింహరెడ్డి, నర్సింహలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.