వనస్థలిపురం : ఇంట్లో పనిచేస్తామని చేరి, అదను చూసుకుని విలువైన వస్తువులను సర్దుకుని ఉడాయిస్తున్న కిలాడి దంపతులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ గాజీపూర్కు చెందిన రితీష్ శ్రీవాస్తవ (27), ప్రగ్యా (23) లు దంపతులు. కొన్నేండ్ల క్రితం నగరానికి వచ్చి వనస్థలిపురం డా సాయినగర్లో నివాసం ఉంటున్నారు.
రితీష్ డ్రైవర్గా, అతడి భార్య ప్రగ్యా ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంటారు. ఉప్పల్లో తాము పనిచేస్తున్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడి వనస్థలిపురానికి మకాం మార్చారు. ఇక్కడ కూడా ఓ ఇంట్లో ఇద్దరూ పనికి చేరి అదును చూసి వెండి, బంగారు వస్తువులతో ఉడాయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి, మంగళవారం రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 45గ్రాముల బంగారం, 750 గ్రామలు వెండిని స్వాధీనం చేసుకున్నారు.