మారేడ్పల్లి : మోండా మార్కెట్లోని శ్రీ మహిశాస్ గాయత్రి హనుమాన్ ఆలయం పునర్నిర్మాణ పనులను శుక్రవారం పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా మంత్రి స్వామి వారికి పూజలు నిర్వహించారు.
అనంతరం శాస్త్రోక్తంగా పూజలు జరిపి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, స్థానిక టీఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆకుల హరికృష్ణ, సత్యనారాయణ, రాములు, జయరాజ్, నాగులు తదితరులు పాల్గొన్నారు.