వనస్థలిపురం : బీఎన్రెడ్డినగర్ డివిజన్లో ఉన్న పెండింగ్ రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. దీనిపై ప్రభుత్వం నియమించిన సబ్కమిటీలోని ఆర్థిక శాఖమంత్రి హరీష్రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను కలిశారు.
కాలనీ సంక్షేమ సంఘాల నాయకులతో కలిసి ఆదివారం మంత్రుల వద్దకు వెళ్లారు. సమస్యను పూర్తిగా వివరించి పరిష్కారానికి సహకరించాలని కోరారు. సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తోందని, వేలాది మంది సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పుల్లారెడ్డి, దామోదర్రెడ్డి, సాయిబాబు, ముత్యంరావు, జ్ఞానేశ్వర్గౌడ్, అమరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.