కొమురవెల్లి, ఆగస్టు 9 : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుం టుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసీమల అభివృద్ధికి ప్రాధాన్య తనిస్తున్నది. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. పట్టణాలకు దీటుగా పల్లెలను ప్రగతిపథంలో నడిపిస్తున్నది. ప్రభుత్వం నెలనెలా పంచా యతీలకు నిధులు కేటాయిస్తూ బలోపేతం చేస్తున్నది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మం డలం మర్రిముచ్చాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో గ్రామం కొత్తశోభను సంతరించుకున్నది. గ్రామపంచాయతీ పరిధిలో 10 వార్డులు ఉండగా, జనాభా 1910 ఉన్నారు. ఇందులో మహిళలు 972, పురుషులు 938 ఉన్నారు. 504 ఇండ్లు ఉన్న ఈ గ్రామానికి ప్రతినెలా సుమారుగా రూ.3 లక్షల నిధులు వస్తున్నాయి. సర్పంచ్ పద్మ ఆధ్వర్యంలో శిథిలావస్థలో ఉన్న 40 ఇండ్లను కూల్చివేశారు. అంతర్గత రోడ్లను ట్రాక్టర్తో చదును చేసి మొరం పోశారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. గ్రామం పరిశుభ్రంగా మారింది.
గ్రామంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించేందుకు గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇండ్లల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ను గ్రామస్తులు గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ స్టాలో వేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగి స్తున్న దుకాణదారులకు జరిమానా విధిస్తున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కిరాణ దుకాణ యజమానులకు నోటీసులు అందజేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
మర్రిముచ్చాలలో లోవోల్టేజీ సమస్యతో ఫ్యూజ్వైర్ కొట్టేయడంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడేవారు. గ్రామంలో లూజ్లైన్లను గుర్తించి 30 మిడిల్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త బుట్టలను అందజేయడంతో పాటు ప్రతి రోజు ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్తను వేర్వురుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో వీధులన్నీ శుభ్రంగా మారాయి. పల్లె పకృతి వనం గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. వైకుంఠధామ నిర్మాణంతో పాటు రూ.9 లక్షల ఈజీఎస్ నిధులతో అంతర్గత రోడ్లు సీసీ రోడ్లు నిర్మించారు. రూ. 22 లక్షలతో చేపట్టిన రైతువేదిక గ్రామానికి ‘ఐకాన్’గా మారింది.
ప్రభుత్వం ప్రతినెలా గ్రామపంచాయతీకి నిధులు జమ చేస్తుండటంతో గ్రామంలో సమస్యలు తొలిగిపోతున్నా యి. మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని స్వచ్ఛతతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం.