ఏకగ్రీవంగా ఆమోదించిన మున్సిపల్ పాలకమండలి
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 31: మున్సిపల్ పాలకవర్గం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 28.03 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసారి అంచనా వ్యయం రూ. 5 కోట్లు పెరిగింది. 2021-22 సంవత్సరానికి మున్సిపల్కు ఆస్తిపన్ను రూ.5.6 కోట్లు, రెవెన్యూ ద్వారా రూ.10 లక్షలు, శానిటేషన్, అద్దెలు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ సెక్షన్ల ద్వారా రూ.10.52 కోట్లు ఆదాయం రానున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపై నాన్ప్లాన్ గ్రాం ట్ ద్వారా రూ.5.51 కోట్లు, ప్లాన్ గ్రాంట్ ద్వారా 3.78 కోట్లు, ఇతర పథకాల ద్వారా రూ.8.2 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. మొత్తంగా మున్సిపాలిటీకి రూ. 28.03 కోట్ల ఆదాయం వస్తున్నట్లు ప్రతిపాదనల్లో వెల్లడించారు. వ్యయం అదే స్థాయిలో ఉండనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆదాయం రూ.28.03 కోట్లు కాగా వ్యయం రూ.27.93 కోట్లు ఉండనున్నట్లు ప్రతిపాదించారు. సిబ్బంది వేతనాలు, పారిశుధ్య నిర్వహణ, రుణాల చెల్లింపులు, విద్యుత్ చార్జిలు, గ్రీన్ బడ్జెట్ కోసం రూ. 7.21 కోట్లను కేటాయించారు. అడ్మినిస్ట్రేషన్, ఇంజి నీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ల నిర్వహణ కోసం రూ.2.64 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో తెలిపారు. వార్డులకు 66.14 లక్షలను కేటాయిస్తున్నట్లు ప్రతి పాదనలు రూపొందించారు. రుణాల చెల్లింపులకు రూ.20 లక్షలు కేటాయించారు. ప్లాన్, నాన్ప్లాన్, గ్రీన్ బడ్జెట్ ఇతర పథకాల ద్వారా రూ.17.21 కోట్లను ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్ అంచనాలను రూపొందిం చారు. కేవలం రూ.10 లక్షల మిగులు బడ్జెట్ ఉండనున్నట్లు మున్సిపల్ చైర్మన్ స్పష్టం చేశారు.
పిల్లికోటాల్లో షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
పిల్లికోటాల్లో షాపింగ్ కాంప్లెక్స్ కోసం స్థలం సేకరించామని త్వరలో పనుల చేపడుతామని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వెల్లడించారు.పట్టణంలోని మున్సిపల్ పాత దుకాణాల సము దాయంలో బహిరంగ వేలం ద్వారా లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. స్లాటర్ హౌస్ నిర్మాణా నికి స్థలం గుర్తించమని త్వరలో టెండర్లు పిలు వను న్నట్లు చైర్మన్ తెలిపారు.
మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలి : మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్
అధికారుల జాప్యం వల్ల పట్టణంలో భగీరథ పనులు సకాలంలో పూర్తి కాలేకపోతున్నాయని వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ మండిపడ్డారు. పట్టణంలో ఏ వార్డు లో చూసిన భగీరథ గుంతలే కనబడుతు న్నాయన్నారు. వెంటనే నల్లాల కనెక్షన్లు ఇచ్చి గుం తలు పూడ్చాలని భగీరథ అధికారులుకు సూచించా రు. ఈసమావేశంలో కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.