పృథ్వీ, రూపాలి, అంబిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పాలిక్ శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్. క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ముహూర్తపు సన్నివేశానికి దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్నిచ్చి టీమ్ను అభినందించారు. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి నటీనటులను తీసుకున్నామని, సున్నితమైన భావోద్వేగాలతో సాగే కుటుంబ కథా చిత్రమిదని, పాటలు కూడా బాగా కుదిరాయని దర్శకుడు పాలిక్ తెలిపారు. వచ్చే నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు దుర్గం రాజేష్, రావుల రమేష్, టీఎస్ రాజు తెలిపారు. ఆమని, ఝాన్సీ, అజయ్ఘోష్, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్-నిశాంత్, సంగీతం: జాన్ భూషణ్, సంభాషణలు: తోటపల్లి సాయినాథ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పాలిక్ శ్రీను.