శంషాబాద్ : 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉత్కంఠగా, ఉత్తేజభరితంగా నిర్వహించారు. ఎయిర్పోర్టు (జిహెచ్ఐఏఎల్)సిఓఓ ప్రతీప్ ఫణికర్, డిఐజి, చీఫ్ ఎయిర్పోర్టు సెక్యూర్టి ఆఫీసర్ ఎం.కె.సింగ్ జాతీయ జెండావిష్కరించారు. అనంతం పోలీస్ ఫరేడ్ మైదానంలో ఎయిర్పోర్టు వివిధ భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు.
ఎయిర్ పోర్ట్ కు చెందిన వివిధ దళాలు కవాతు, విన్యాసాలు నినిర్వహించాయి. క్విక్ రెస్పాన్స్ టీం, సిఐఎస్ఎఫ్, జిఎంఆర్ రక్ష సెక్యూరిటీ, ఏఆర్ఎఫ్ఎఫ్, కమాండోల విన్యాసాలు ఉత్కంఠభరితంగా సాగాయి. డాగ్స్కాడ్ మార్చ్, విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.