సికింద్రాబాద్ : సివరేజీ సిబ్బంది భద్రతా ప్రమాణాలను పాటిస్తు విధులు నిర్వహించాలని జలమండలి మారేడ్పల్లి డివిజన్ డీజీఎం వై. కృష్ణ అన్నారు. భద్రతా వారోత్సవాల సందర్భంగా జలమండలి సీతాఫల్మండి, శ్రీనివాస్నగర్, బౌద్ధనగర్ సెక్షన్లలో సిబ్బందికి మురుగునీటి నిర్వహణ, భద్రతా అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ డ్రైనేజీ మ్యాన్హోల్లు శుభ్రం చేసే క్రమంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా ఇష్టానుసారంగా డ్రైనేజీలో చెత్త ఇతర వస్తువులు వేయకుండా ఉండాలన్నారు.
కొందరు చేసే తప్పుల వల్ల సిబ్బంది ప్రాణాల మీదకి వస్తుందని గ్రహించాలన్నారు. డ్రైనేజీలో కేవలం మురికినీళ్లు మాత్రమే ఉంటే సాఫీగా వెళాతాయని, చెత్త వేసినప్పుడే బ్లాక్ అవుతుందని తెలిపారు. సివరేజీ సిబ్బందికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అవగాహన కార్యక్రమాలు 15 రోజుల పాటు కొనసాగుతాయని డీజీఎం కృష్ణ చెప్పారు. అనంతరం సిబ్బందితో భద్రతా ప్రమాణాలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ అన్విత్ తదితరులు పాల్గొన్నారు.