మన్సూరాబాద్ : నిరక్షరాస్యులైన మహిళలకు విద్యాబుద్దులు నేర్పి వారిలో చైతన్యం కల్పించిన మొట్ట మొదటి ఉపాధ్యా యురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలకు అనుగుణంగా పయనించాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చిత్రసీమకాలనీలో సావిత్రిబాయి పూలే ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం 191వ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, కర్మన్ ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై సావిత్రిబాయి పూల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, పోచబోయిన జగదీష్యాదవ్, నాయకులు అనంతుల రాజిరెడ్డి, జక్కిడి రఘువీర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించిన రామ్మోహన్ గౌడ్
చిత్రసీమకాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, బీఎన్రెడ్డి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న వేరు వేరుగా హాజరై సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.