మియాపూర్: పారిశుద్ధ్య కార్మికులు తల్లిదండ్రులతో సమానమని, కరోనా వంటి విపత్కర సమయాలలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతో విలువైన సేవలను అందించారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన వారి సేవలను ఎన్నటికీ మరిచిపోలేమని, అందుకే ప్రభుత్వం వీరిని గుర్తించి అదనపు వేతనాలు సహా పలు రకాలుగా ప్రోత్సహించిందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలో పని చేస్తున్నపారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ద్వారా పీపీఈ కిట్లను వైద్యాధికారి చంద్రశేఖర్రెడ్డి , కార్పొరేటర్లు రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం తన నివాసంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా పని చేస్తున్న కార్మికులను గౌరవప్రదంగా చూడాలని ఆయన కోరారు. కార్మికుల భద్రతే ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నో వసతులను కల్పిస్తున్నదని, విధి నిర్వహణలో కీలకంగా ఉపయోగపడేందుకు పీపీఈ కిట్లను అందిస్తున్నదన్నారు. ప్రభుత్వ పరంగా పారిశుద్ధ్య కార్మికులకు అన్ని రకాలుగా తోడ్పాటును కల్పిస్తూ వారిని కాపాడుకుంటున్నదని విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీ సత్యనారాయణ,నాయక్, పార్టీ నేతలు రఘునాథ్రెడ్డి, శ్రీనివాసయాదవ్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.