బంజారాహిల్స్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం బంగారం విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లో నివాసం ఉంటున్న వీరభద్ర మినరల్స్ గ్రానైట్స్. జీవీపీఆర్ మినరల్స్ సంస్థ ఎండీ జీవీ.ప్రతాప్రెడ్డి విరాళం అందజేశారు.
జీవీ.ప్రతాప్రెడ్డి తో పాటు ఆయన తనయుడు, సంస్థ డైరెక్టర్ వీర దినేష్రెడ్డి గురువారం మంత్రి కేటీఆర్ను కలిశారు. స్వర్ణ గోపురం కోసం కిలో బంగారం కొనుగోలు కోసం తమ సంస్థల తరపున రూ.50లక్షల చెక్కును మంత్రి కేటీఆర్కు అందజేశారు.