నందిగామ, అక్టోబర్ 1 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తోందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం మేకగూడ, చాకలిగుట్టతండా గ్రామాల్లో శనివారం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, కుల మతాలకతీతంగా అన్ని మతాల పండుగలను గౌరవించి ప్రభుత్వం పండుగలకు కానుకలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల, పీఏసీఎస్ చైర్మన్ మంజూలరెడ్డి, కొత్తూరు, నందిగామ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పద్మారెడ్డి, కృష్ణ, సర్పంచ్ రాజూనాయక్, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, తులసీరామ్నాయక్, కిషన్ నాయక్, విజయ్నాయక్, రాజు పాల్గొన్నారు.
కేశంపేట, అక్టోబర్ 1 : మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కాకునూరు, తొమ్మిదిరేకుల, లింగంధన, నిర్దవెళ్లి, లేమామిడి, బొదునంపల్లిలో శనివారం ఆయన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు లక్ష్మమ్మ, సావిత్రి, పార్వతమ్మ, శ్రీశైలంగౌడ్, కళమ్మ, జడ్పీటీసీ విశాలశ్రావణ్రెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, వైస్చైర్మన్ అంజిరెడ్డి, పీఏసీఎస్ మాజీ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్: సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పెద్దపీట వేస్తున్నారని ఫరూఖ్నగర్ మండల రాసుమళ్లగూడ సర్పంచ్ మాధవి అన్నారు. శనివారం గ్రామ మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల కోసం సీఎం కేసీఆర్ ప్రతి ఏటా బతుకమ్మ చీరలను అందజేస్తూ వారికి పెద్దన్నగా నిలిచాడన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
షాబాద్, అక్టోబర్ 1: ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ముద్దెంగూడ సర్పంచ్ కుర్వ జయమ్మ, ఉప సర్పంచ్ సామ ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని ముద్దెంగూడ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామమైన ఎర్రొనిగూడ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శోభ, మహిళలు పాల్గొన్నారు.