మంచాల, సెప్టెంబర్19 : టీఆర్ఎస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివా రం మంచాల మండలం ఆగపల్లి గ్రామానికి చెం దిన వివిధ పార్టీలకు చెందిన 60 మంది యువకులు మండలాధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, సర్పంచ్ గోసుల జం గయ్య యాదవ్, ఉపసర్పంచ్ రఫీక్, గ్రామశాఖ అధ్యక్షుడు, పూజారి శ్రీరాములు, కార్యదర్శి బహదూర్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, జం గయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయండి
యాచారం, సెప్టెంబర్19 : టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మేడిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బోడ కృష్ణతో పాటు పలు పార్టీలకు చెందిన 20 మంది నాయకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ను మండలంలో మ రింత పటిష్ట పరిచేందుకు ప్రతి కార్యకర్త సైనికు ల్లా పని చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా, సర్పంచ్ శ్రీనివా స్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, డైరెక్టర్ మక్కపల్లి స్వ రూప, టీఆర్ఎస్ నాయకులు మల్లేశ్, లోహిత్రెడ్డి, బాల్రాజ్, శంకర్, కిషన్, రమేశ్, అంజ య్య, కృష్ణ, శ్రీశైలం, బాలయ్య ఉన్నారు.