ఉస్మానియా యూనివర్సిటీ : ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళ నాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కళాశాలలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమ్మేళనం వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మేళనానికి ప్రధాన ముఖ్య అతిథిగా హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వర్ రావు, గౌరవ అతిథిగా కేంద్రప్రభుత్వ ఎంఎస్ఎంఈ శాఖ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ హాజరవుతారని చెప్పారు.
సమ్మేళనానికి కళాశాల పూర్వవిద్యార్థులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ చింత సాయిలు, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రభాకర్రెడ్డి, ఓయూసీటీఏఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజమహేందర్రెడ్డి, కోశాధికారి రాములు, డాక్టర్ ఎ. పరుశురాం తదితరులు పాల్గొన్నారు.