సికింద్రాబాద్ : కంటోన్మెంట్లో ఒమిక్రాన్ కలకలం రేపింది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ ఫార్మసీ చదువుతున్న 27 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే యువకుడు చిరునామాగా కారానాలోని విక్రమ్పురి కాలనీలో ఉంటున్నట్లు అధార్లో నమోదైంది.
అప్పటికే యువకుడిని చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కార్కానాలోని విక్రమ్పురి కాలనీలో యువకుడి చిరునామాను గుర్తించగా అది నకిలీ చిరునామాగా తేల్చా రు. యువకుడు ఉండేది నగరంలోని టోలీచౌకి ప్రాంతం అని నిర్థారణ కావడంతో అధికారులు హమ్మయ్య అనుకున్నారు.
దీంతో అధికారులు తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లను ఇచ్చే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కంటోన్మెంట్లో ఒమిక్రాన్ నిర్దారణ కాలేదని తెలియడంతో అధికారులతో పాటు జనం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.