కందుకూరు : అధికారులు నిజాయితీగా పని చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గచ్చిబౌళిలోలో జరిగిన కార్యక్రమంలో కందుకూరు డివిజన్ ఆర్డీఓ వెంకటాచారి, నాయబ్ తహసీల్దారు బైరు సుదర్శన్రెడ్డిలకు అవార్డులు, ప్రశాంశ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు చిత్తశుద్దితో పని చేయాలని కోరారు.
అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయని పేర్కొన్నారు. కాగా ఆర్డీఓ వెంకటాచారి, నాయబ్ తహసీల్దారు బైరు సుదర్శన్రెడ్డిలు అవార్డులు అందుకున్న సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు వారిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరు అమయ్కుమార్, అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.