కాచిగూడ : అంబర్పేట నియోజకవర్గంలోని పలు డివిజన్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
కాచిగూడ డివిజన్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఆర్టీసీ బస్ డిపో లైన్లో రూ.48.5 లక్షల రూపాయలు, డివిజన్లోని దశరథ్ లైన్ సమీపంలో రూ.4 లక్షల రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన మంచినీటి పైప్లైన్ పనులను శుక్రవారం కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో ఎమ్మెల్యే కాలేరు ప్రారంభించారు.
అనంతరం బస్తీలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ పర్యటించి స్థానిక ప్రజల నుంచి నీటి, డ్రైనేజీ పలు సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ నియోజకవర్గంలోనిఅన్ని బస్తీ, కాలనీలలో సీసీ రోడ్లను వేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర బీష్మదేవ్,కన్నె ఈఈ శంకర్, డీఈ సువర్ణ, ఏఈ ప్రేరణ, సంపత్, జలమండలి మేనేజర్ భావన, దాత్రిక్ నాగేందర్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.