నిజాంసాగర్ మండలంలో దళితబంధు పథకంలో 1800 మంది లబ్ధిదారులను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్లో ప్రారంభించిన ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిజాంసాగర్ను సైతం పైలట్ మండలంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 27 గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్త్తికావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కులధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాలకు వెళ్తున్నారు. ఈ పథకం కింద అందించే రూ.10 లక్షలతో ఆర్థికాభివృద్ధి సాధించే మార్గాలను దళిత కుటుంబాలు అన్వేషిస్తున్నాయి.
నిజాంసాగర్, సెప్టెంబర్ 20 : అడుగడుగునా అణచివేతకు గురైన దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్లో ఈ పథకా న్ని ప్రారంభించగా.. కామారెడ్డి జిల్లాలో ని నిజాంసాగర్ మండలాన్ని సైతం పైల ట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. మం డలంలోని 27 పంచాయతీల్లో 1800 మంది లబ్ధిదారులను గుర్తించడం.. వీరందరికీ పథకం వర్తించ నుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1800 మంది లబ్ధిదారులుగా ఎంపిక
జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ దళితబంధుపై అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిజాంసాగర్ మండలంలో 1800 మంది లబ్ధిదారులను దళితబంధు పథకం కింద ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీంతో మండలంలోని ఆయా గ్రామాల్లోని దళితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో పథకం అమలు కానుండడంతో కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలవైపు పరుగులు తీస్తున్నారు. దళితులకు అందించే రూ.10 లక్షల నగదు ను ఆర్థిక అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని.. చిన్న పరిశ్రమలతో పా టు వివిధ రకాల వ్యాపారాలు చేసుకోవాలని సూచించడంతో దళితులు ఇప్పటి నుంచే తమ తమ గ్రామంలో ఎలాంటి వ్యాపారాలు పెట్టుకుంటే బాగుంటుందో ఆలోచిస్తున్నారు.
దళితబంధులో 30 రకాల వ్యాపారాలు
ప్రస్తుతం దళితబంధు పథకం ద్వారా అందించే పది లక్షల రూపాయలతో 30 రకాల వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించింది. గేదెలు, గొర్రెల పెంపకం, పౌల్ట్రీ, ట్రాక్టర్ కొనుగోలు, సెంట్రింగ్ కొనుగోలుతో పాటు మొత్తం 30 రకాల వ్యాపారాలు పెట్టుకోవచ్చని ప్రకటించంతో దళిత కుటుంబాలు ఇప్పటి నుంచే ఎలాంటి వ్యాపారం నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనలు చేస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామా ల్లో పంచాయతీ కార్యద్శులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. దళితబంధు పథకంతో ఏం వ్యాపారం నిర్వహించుకుంటారనే విషయాలపై సైతం సర్వే నిర్వహిస్తున్నారు. తాజాగా నిజాంసాగర్ మండలంలో 1800 దళిత కుటుంబాలకు పథకం వర్తిస్తుందని ప్రకటించడంతో దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.