ఎల్బీనగర్ : కొత్త సంవత్సరానికి కొత్త ఆశలు, ఆశయాలతో స్వాగతిద్దామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా గత సంవత్సరం అనేక ఇబ్బందులు పడ్డామని, ప్రజలు, అనేక రంగాల వారు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రస్తుతం సాధారణ స్థితికి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయన్నారు.
ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రాబోయే నూతన ఆంగ్ల సంవత్సరాదిని స్వాగతించాలన్నారు. నూతన సంవత్సరాదిలో నూతన ఆశలు, ఆశయాలతో, లక్ష్యాలను సాధించే విధంగా ముందుకు సాగాలని ఆయన కోరారు.
నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం : ఉప్పల శ్రీనివాస్ గుప్త
నూతన ఆంగ్ల సంవత్సరాదిని అందరూ కొత్త ఆశయాలతో స్వాగతిద్దామని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.
పాత ఏడాది తీపి, చేదు గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ నూతన ఏడాదిలో లక్ష్యాలను ఎంచుకుని అంతా ముందుకు సాగుదామన్నారు.