పట్టణబాటలో ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి
జడ్చర్ల, ఏప్రిల్ 6: అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని పాతబజార్, జవహర్నగర్, కావేరమ్మపేట తదితర కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించి కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అంతర్గత రోడ్లులేవని, సీసీరోడ్లు నిర్మించాలని ఆయా కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. కావేరమ్మపేటలో పార్కు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా కావేరమ్మపేటలోని మటన్ మార్కెట్ను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న మటన్ మార్కెట్ చిన్నగా ఉన్నందున కమ్యూనిటీహాల్గా చేసి మటన్ మార్కెట్ను వేరే ప్రాంతంలో నిర్మిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించగా వారు అంగీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇంటింటికీ నల్లాకనెక్షన్, ప్రతి కాలనీలో సీసీరోడ్లు వేస్తామని, దానికి అనుసంధానంగా డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని నల్లచెరువు మినీ ట్యాంక్బండ్ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. రూ.3కోట్లతో నిర్మిస్తున్న బండ్పై వాకింగ్ట్రాక్ తదితర పనులను పరిశీలించారు. బండ్మీద మొక్కలు నాటాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సంగీతనాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మార్కెట్ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, మున్సిపల్ కమిషనర్ సునీత, ఏఈ సాయికిరణ్, మాజీ చైర్మన్ మురళి, మాజీ సర్పంచులు సీతారాం, రేణుక, పార్టీ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, జీనురాల సత్యం, కోట్ల ప్రశాంత్రెడ్డి, శ్రీకాంత్, రవిశంకర్, రమేశ్, దామోదర్, కృష్ణారెడ్డి, రమేశ్, గోపాల్యాదవ్, రవితేజ, శ్రీనుయాదవ్, సుభాన్, లత, పార్వతమ్మ, మాజీ వార్డు సభ్యులు మహేశ్గౌడ్, ప్రీతం, నాయకులు ఉళ్లబాయి యాదిరెడ్డి, దోరేపల్లి రవీందర్, ఇర్ఫాన్ ఉన్నారు.
అన్నదాన కార్యక్రమం ప్రారంభం
జడ్చర్ల పట్టణంలోని సకలదేవతల ఆలయ ఆధ్వర్యంలో పాలాది రమేశ్ జడ్చర్ల లయన్స్క్లబ్ భవన సమదాయంలో జడ్చర్ల-కల్వకుర్తి ప్రధాన రహదారిపై అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. పాలాది లక్ష్మీనారాయణ, లక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎండకాలం దృష్టిలో ఉంచుకొని పాలాది రమేశ్ చలివేంద్రంతోపాటు చిత్రన్నం, పెరుగన్నం ప్రతిరోజూ ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వేసవిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కోట్ల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్, రాఘవేంద్ర, కొంగళినాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఫతేపూర్ మైసమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
నవాబ్పేట, ఏప్రిల్ 6: మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవత ఆలయంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో మెట్టుగడ్డ సర్పంచ్ జమున లింబ్యానాయక్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే ముందుగా అమ్మవారికి పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి..
బెంగాల్ పోరు : తృణమూల్ మహిళా అభ్యర్ధిపై దాడి
పంజాబ్ జైలు నుంచి యూపీ ఎమ్మెల్యే తరలింపు..