చంఢీఘడ్: పంజాబ్లోని రూప్నగర్ జైలులో ఉన్న బీఎస్పీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని ఇవాళ యూపీ పోలీసులకు అప్పగించారు. మార్చి 26వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ ఎమ్మెల్యేను యూపీకి బదిలీ చేశారు. యూపీలో అన్సారీపై పలు కేసులు నమోదై ఉన్నాయి. అన్సారీని కస్టడీలోకి తీసుకునేందుకు యూపీ పోలీసులు ఇవాళ ఉదయం పంజాబ్ వచ్చారు. యూపీలోని బాండా జైలుకు అతన్ని తరలిస్తున్నారు. మవా నియోజకవర్గానికి చెందిన బీఎస్సీ ఎమ్మెల్యే అన్సారీపై ముఠా వసూళ్ల కేసు ఉన్నది. ఎమ్మెల్యేను యూపీకి తీసుకువెళ్తున్న క్రమంలో పంజాబ్ కమాండోలు దారి పొడుగునా రక్షణ కల్పించారు. యూపీ-పంజాబ్ రూట్లో బందోబస్తును పెంచారు.