మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ నాయకులు ధాన్యం కల్లాల వద్దకు వెళ్లి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి హితవు పలికారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు కష్టం కలిగించొద్దని టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుంటే, తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. రైతులకు సాయం చేయడం చేతకాదు కానీ, రాజకీయం మాత్రం చేతనవుతుందని విమర్శించారు. సమావేశంలో మిర్యాలగూడ, తడకమళ్ల, అన్నారం, తుంగపహాడ్ పీఏసీఎస్ చైర్మన్లు బంటు శ్రీనివాస్, పాదూరు సంజీవరెడ్డి, వెంకట్రెడ్డి, ఆదిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మట్టపల్లి సైదులు, పులి జగదీశ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షకు దరఖాస్తులు ప్రారంభం