రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్
నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో 200 మంది టీఆర్ఎస్లో చేరిక
కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 16 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. నకిరేకల్ పట్టణంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిలుకూరి లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో 200మంది పద్మశాలీలు, చేనేత సంఘం నాయకులు శుక్రవారం నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. నకిరేకల్ పట్టణంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువత టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్రానివి తుగ్లక్ చర్యలు : రాహుల్ గాంధీ