ఉపయోగంలోకి తెచ్చినటీఆర్ఎస్ ప్రభుత్వం
విశేషంగా కృషిచేసిన నోముల నర్సింహయ్య
సంతోషంలో నిడమనూరువాసులు
నిడమనూరు, ఏప్రిల్ 16 : పాత తాలూకా కేంద్రమైన నిడమనూరు మండల కేంద్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని (బస్టాండ్) టీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 1992లో ప్రారంభించిన బస్టాండ్ నాలుగేండ్లకే నిర్వహణ పెనుభారంగా మారిందన్న కారణంతో మూతపడింది. దశాబ్దంన్నర కాలంపాటు తౌడు మిల్లుకు లీజుకిచ్చారు. 2014లో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య దృష్టికి ఈ విషయాన్ని స్థానికులు తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దీంతో ప్రభుత్వ పెద్దలతో నోముల మాట్లాడి బస్టాండ్ పునః ప్రారంభం దిశగా చర్యలు చేపట్టారు. రూ.10 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టి 2016 జనవరి 1న బస్టాండ్ను పునః ప్రారంభించారు. ఎట్టకేలకు మండలవాసులకు నిడమనూరు బస్టాండ్ అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
కరోనా పరీక్షలు అందుబాటులో ఉండాలి : ఏపీ సీఎం