అమరావతి : కరోనా పరీక్షలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
కరోనా లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ఆయన కోరారు.
శుక్రవారం రాష్ట్రంలో కొవిడ్ నివారణ చర్యలు, టీకా పంపిణీపై కలెక్టర్లు, ఎస్సీలు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 62 శాతం కరోనా కేసులు ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
మరణాలు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయని తెలిపారు. బాధితులు దవాఖానకు వెళ్లేందుకు ఆలస్యం చేస్తున్న కారణంగా మరణాలు పెరుగుతున్నాయని చెప్పారు.
వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజల్లో అవగాహన పెంచి కరోనా కట్టడికి కృషి చేయాలని సీఎం జగన్ సూచించారు.
ఇంటింటి సర్వే నిర్వహణకు కసత్తు చేయాలని, సీసీటీవీల ద్వారా కొవిడ్ దవాఖానలను పర్యవేక్షించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని, శానిటైజేషన్పైనా దృష్టి పెట్టాలని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి