ఇంఫాల్: జవాన్ల కాన్వాయ్పై మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మణిపూర్లోని ఉఖ్రుల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Assam Rifles soldiers killed) సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నుంగ్షాంగ్ ఖోంగ్ ప్రాంతంలో 40 అస్సాం రైఫిల్స్కు చెందిన కాన్వాయ్పై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. వెంటనే ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. దాడి చేసిన అనుమానిత మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
కాగా, ఉఖ్రుల్ జిల్లాలోని లంబూయి గ్రామంలో మోహరించిన సుమారు 40 మంది అస్సాం రైఫిల్స్ సిబ్బంది న్యూ హెవెన్లో ఒక అవుట్పోస్ట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అయితే స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపకుండా అవుట్పోస్ట్ ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. ఆదివారం మహిళలు, విద్యార్థి సంఘాలతో సహా స్థానికులు నిరసన తెలిపారు. అవుట్పోస్ట్ నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు నిరసన చేస్తున్న జన సమూహాన్ని నియంత్రించేందుకు అస్సాం రైఫిల్స్ సిబ్బంది లాఠీచార్జ్తో పాటు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా నలుగురు గ్రామస్తులు గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత మిలిమెంట్లు మెరుపుదాడి చేయడంతో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మరణించగా పలువురు గాయపడ్డారు.