త్రిపురారం, ఏప్రిల్ 11 : సకల జనులు ఏకమై భగత్ను గెలిపించాలని రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్ కోరారు. మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో ముదిరాజ్ మత్స్యకార్మికుల సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ వారి జీవితాల్లో మార్పు తెచ్చిందన్నారు. ఆర్థికాభివృద్ధికి సహకరించిందన్నారు. అతి త్వరలోనే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి సొసైటీలో సభ్యత్వం కల్పించే చర్యలు ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి పాటుపడే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సీపీఎం, సీపీఐ పార్టీలు భగత్కు మద్దతు తెలుపడం శుభపరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చొప్పరి శంకర్, మహేశ్, శంకర్, నియోజకవర్గ ఇన్చార్జి వెలుగు రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, ఎంపీటీసీ అంబటి రాము, బొక్క శ్రీను, నాయకులు చంద్రయ్య, లక్ష్మయ్య, అంజయ్య, సోమయ్య, మంత్రి శ్రీను, కోలా సైదులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
వాహనాలను తగులబెట్టిన మావోయిస్టులు
పాక్ తొలి ఆర్థిక మంత్రి చాన్స్కు నో.. ఎవరంటే..!